
హైదరాబాద్, 26 జూలై (హి.స.)
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP-SP) అధ్యక్షుడు శరద్ పవార్ స్పందిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశంలోని యువశక్తి ఐక్యతకు మరియు ప్రజాస్వామ్యానికి లభించిన ఒక పెద్ద విజయమని అభివర్ణించారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వరుసగా 28 రోజుల పాటు యువత, విద్యార్థులు ప్రదర్శించిన అలుపెరగని పోరాటం, పట్టుదల నిజంగా అభినందనీయమని ఆయన కొనియాడారు. ఏలాంటి భయం లేకుండా అణచివేతకు వ్యతిరేకంగా నిలబడి, అన్యాయంపై నైతిక బాధ్యత వహించేలా ప్రభుత్వాన్ని ఒప్పించిన ఈ పోరాటం ప్రజాస్వామ్య శక్తీకి చిహ్నమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.గతంలో నిరసన స్థలాన్ని సందర్శించిన శరద్ పవార్, దేశ యువతకు నైతిక మరియు పార్లమెంటరీ మద్దతును అందించినందుకు ప్రతిపక్ష పార్టీల పార్లమెంట్ సభ్యులకు (MPs) ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలో ప్రజాస్వామ్యం విజయం సాధించిందని, ఆ ఘనత నిస్సందేహంగా యువతరానికే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. నీట్-యూజీ (NEET-UG) 2026 పేపర్ లీకేజీ, అవకతవకలతో పాటు సీబీఎస్ఈ (CBSE) ఆన్-స్క్రీన్ మార్కింగ్ ప్రక్రియలో లోపాలపై జవాబుదారీతనం వహించాలని, ప్రభుత్వ పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణలు తేవాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో ఈ నిరసనలు జరిగాయి. ఈ తీవ్ర ఒత్తిడి మధ్యే ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ తాను మొదటి రోజు నుంచే నీట్ పేపర్ లీక్పై బాధ్యత తీసుకున్నానని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీకి తన రాజీనామాను సమర్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi