21ఏళ్లకే ఐఏఎస్ అవుతున్నప్పుడు ఎమ్ఎల్యే, ఎంపీలు ఎందుకు కాకూడదు
21ఏళ్లకే ఐఏఎస్ అవుతున్నప్పుడు ఎమ్ఎల్యే, ఎంపీలు ఎందుకు కాకూడదు
Telangana CM Revanth Reddy


హైదరాబాద్, 26 జూలై (హి.స.)

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు మరియు ఎంపీలుగా పోటీ చేసే కనీస వయస్సును తగ్గించాలనే ప్రతిపాదనకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఇరవై ఒక్క సంవత్సరాల వయసున్న యువత ఐఏఎస్ అధికారులుగా మారి జిల్లాలను, దేశాన్ని నడిపించగలిగినప్పుడు, చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా ఎందుకు ఎన్నిక కాకూడదని ఆయన ప్రశ్నించారు. గతంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును ఇరవై ఒక్క సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించి విప్లవాత్మక మార్పు తెచ్చారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు చట్టసభల్లో పోటీ చేసే వయస్సును కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం దేశంలో ఎమ్మెల్యే లేదా లోక్‌సభ ఎంపీగా పోటీ చేయడానికి కనీసం ఇరవై ఐదు సంవత్సరాల వయసు నిండాలనే నిబంధన ఉంది. అయితే ఈ వయసు పరిమితిని ఇరవై ఒక్క సంవత్సరాలకు తగ్గించడం ద్వారా యువత దేశ రాజకీయాల్లో, నిర్ణయాధికారాల్లో మరింత చురుగ్గా పాల్గొనే అవకాశం లభిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యువత ఆలోచనలకు మరియు ఆకాంక్షలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం దక్కాలంటే ఈ మార్పు అనివార్యమని, దీనిపై జాతీయ స్థాయిలో విస్తృతమైన చర్చ జరగాలని ఆయన పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande