
మార్కాపురం, 20 సెప్టెంబర్ (హి.స.) మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలంలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన గుండంచర్ల, సుంకేసుల, పుచ్చకాయలపల్లి స్వర్ణ, గొట్టిపడియ గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత నిర్వాసితలైన నివాసితులకు హామీ ఇచ్చారు.
జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, డిఆర్ఓ వెంకట శివరామి రెడ్డి మరియు జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఆమె, ప్రాజెక్ట్ కారణంగా ముంపు ముప్పును ఎదుర్కొంటున్న గొట్టిపాడియ మరియు అక్కచెర్వు తండ గ్రామాలను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించారు.
ఈ పర్యటనలో భాగంగా కలెక్టర్ జలహారతి వ్యూ పాయింట్ను సందర్శించడంతో పాటు, టన్నెల్-2 ఎగ్జిట్ పాయింట్ను క్షేత్రస్థాయిలోతనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 243.8 మీటర్లుగా నమోదు కాగా, క్రాస్ రెగ్యులేటర్ వద్ద 4.05 కిలోమీటర్ల మేర నీటిమట్టం ఉందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV