అమరావతి, 1 అక్టోబర్ (హి.స.)
రాజమండ్రి, అక్టోబర్ 1: గోదావరి ప్రాంతానికి గుర్తింపు తెచ్చిన లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి జయంతి రోజున రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చామని, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.
రాజమండ్రి నుంచి ముంబై, ఢిల్లీకి ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు. తిరుపతికి మంచి డిమాండ్ ఉందన్న కేంద్రమంత్రి.. డిమాండ్ ఉన్న సర్వీసులకు మరో మూడు నెలల వరకు టిక్కెట్లు బుక్కయ్యాయని ఆయన తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ