కాంగ్రెస్లోకి ఎందుకొచ్చినవే.. ఈ ప్రభుత్వంల ఏ పనులూ కావు.. చేవెళ్ల ఎమ్మెల్యేతో రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.) కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి నుంచి అధికార పార్టీలోకి మారిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాద
రాజగోపాల్ రెడ్డి


హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.) కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి నుంచి అధికార పార్టీలోకి మారిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను.. కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో ఏ పనులు కావు, అనవసరంగా వచ్చారంటూ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలోని తన వ్యవసాయక్షేత్రానికి రాజగోపాల్ రెడ్డి వెళ్తున్న క్రమంలో.. చిలుకూరులోని పెద్దచెరువును పరిశీలిస్తూ కనిపించిన ఎమ్మెల్యే కాలె యాదయ్య వద్దకు వెళ్లి పలకరించారు. 'యాదన్నా.. ఎందుకు వచ్చినవే కాంగ్రెస్లోకి. ఈ ప్రభుత్వంలో ఏ పనులు కావు. అనవసరంగా వచ్చినవ్' అని చెప్పారు. దీనికి ఆయన స్పందించనప్పటికీ.. చిరునవ్వు చిందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande