గనుల శాఖ పై.సుంచంద్రబాబు.సమీక్ష
అమరావతి, 17 అక్టోబర్ (హి.స.): గనులశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంపైనా చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖేశ్‌కుమార్‌ మీనా, ప్రవీణ్‌ కుమార్‌, ఆర్టీజీ అధికా
గనుల శాఖ పై.సుంచంద్రబాబు.సమీక్ష


అమరావతి, 17 అక్టోబర్ (హి.స.): గనులశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంపైనా చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖేశ్‌కుమార్‌ మీనా, ప్రవీణ్‌ కుమార్‌, ఆర్టీజీ అధికారులు హాజరయ్యారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గనుల శాఖ ద్వారా రూ.3320 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గతం కంటే 34 శాతం మేర అదనంగా గనులశాఖ నుంచి ఆదాయం వస్తోందని తెలిపారు. మాంగనీస్‌ లాంటి మేజర్‌ ఖనిజాలతో 72 శాతానికి పైగా అదనపు ఆదాయం వస్తోందని సీఎంకు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande