
హైదరాబాద్, 23 అక్టోబర్ (హి.స.)
ఢిల్లీ, ప్రయాగ్రాజ్, వారణాసి వెళ్లే
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్, చర్లపల్లి నుంచి దానాపూర్కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు చెప్పింది. ఈ నెల 28, నవంబర్ 2 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని.. ప్రస్తుతం ఉన్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ రైళ్లను నడిపిస్తున్నట్లు చెప్పింది. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ (07081) రైలు అక్టోబర్ 28, నవంబర్ 2 తేదీల్లో రాకపోకలు సాగిస్తుందని.. తిరిగి నిజాముద్దీన్ నుంచి సికింద్రాబాద్ (07082) రైలు అక్టోబర్ 30, నవంబర్ 4 తేదీల్లో రైలు నడుస్తుందని పేర్కొంది.
ఈ రైలు మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముఖేడ్, నాందేడ్, పూర్ణ, బస్మత్, హింగోలి, వాసిమ్, అకోలా, మల్హాపూర్, ఖండ్వా, ఇటార్సీ, నర్మదాపురం, రాణి కమలాపతి, భోపాల్, భోపాల్, బినా, ఝాన్సీ, గ్వాలియర్, దౌల్హాపూర్, ఆగ్రా, మథు స్టేషన్లలో రైలు ఆగుతుందని చెప్పింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..