
తెలంగాణ, 23 అక్టోబర్ (హి.స.) రైతులు ఎవ్వరు కూడా బయట దళారులకు ధాన్యం విక్రయించ వద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. గురువారం యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఎన్ని ధాన్యం కుప్పలు వచ్చాయని, అన్ని కుప్పలను రోజు మాయిశ్చర్ చెక్ చేస్తున్నారా, తేమ శాతం వచ్చిన వాటిని వెంటనే తూకం వేసి లారీ లోడ్ చేసి మిల్లులకు తరలించాలని, ఆలస్యం చేయొద్దని సూచించారు.
అయితే కొనుగోలు కేంద్రంలో కరెంటు సదుపాయం లేదని రైతులు కోరడంతో వెంటనే సంబంధిత కరెంటు ఎస్ ఈ కి ఫోన్ చేసి వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు