పోలీసు విచారణకు హాజరైన టీటీడీ మాజీ చైర్మన్ భూమన
తిరపతి, 23 అక్టోబర్ (హి.స.) వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ శాలలో గోవుల మరణంపై కొద్ది నెలల క్రితం పలు ఆరోపణలు చేశారు. ఈ విషయమై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్
భూమన


తిరపతి, 23 అక్టోబర్ (హి.స.) వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ శాలలో గోవుల మరణంపై కొద్ది నెలల క్రితం పలు ఆరోపణలు చేశారు. ఈ విషయమై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పొలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని భూమన కరుణాకర్ కు నోటీసులను జారీ చేశారు. ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలను చూపాలని కోరారు. ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ పోలీసు విచారణకు హాజరయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande