
ఢిల్లీ,23, అక్టోబర్ (హి.స.) అస్సాం ప్రభుత్వం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో “లవ్ జిహాద్”, బహుభార్యత్వాన్ని అరికట్టడానికి కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. ఈసందర్భంగా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో లవ్ జిహాద్, బహుభార్యత్వం వంటి అంశాలను పరిష్కరించే అనేక ముఖ్యమైన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడుతుందని చెప్పారు. మంత్రివర్గం వాటిని ఆమోదించిన తర్వాత వివరాలను అందిస్తామని సీఎం పేర్కొన్నారు.
బుధవారం (అక్టోబర్ 22) నాగాంవ్లో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం శర్మ విలేకరులతో మాట్లాడారు. ఈ ముసాయిదా బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లభించిన తర్వాత వాటి వివరాలను పంచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. “రాబోయే అస్సాం అసెంబ్లీ సమావేశాల్లో ‘లవ్ జిహాద్’, బహుభార్యత్వం, సత్రాల (వైష్ణవ మఠాలు) రక్షణ, టీ తోటలలో పనిచేసే గిరిజన ప్రజలకు భూమి హక్కులు వంటి అంశాలపై కొన్ని ముఖ్యమైన, చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెడతామని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ