
బీజాపుర్, 29 అక్టోబర్ (హి.స)
: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 9 మంది మహిళా నక్సల్స్ ఉన్నారని పోలీసులు తెలిపారు. మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని ఈ సందర్భంగా పోలీసు అధికారులు కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు