
చిత్తూరు 24 అక్టోబర్ (హి.స.),:రాష్ట్రవాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు నగర మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురు ప్రధాన ముద్దాయిలపై నేరం రుజువు అయిందని ప్రత్యేక మహిళా కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ప్రత్యేక మహిళా కోర్టు శుక్రవారం పూర్తి చేసింది. ఈ కేసులో దోషులకు అక్టోబర్ 27వ తేదీన శిక్షలు ఖరారు చేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకోవాలని చిత్తూరు వన్ టౌన్ పోలీసులను ప్రత్యేక మహిళా కోర్టు ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ