
షాద్నగర్, 24 అక్టోబర్ (హి.స.)
రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు
ఎప్పుడూ రైతుల పక్షమేనని, అన్నం పెట్టే రైతన్న నష్టపోవద్దన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశ్యమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం కేశంపేట మండల పరిధిలోని కొత్తపేట పి ఏ సి ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేవిధంగా పని చేస్తుందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు