‘అత్యంత పేదరిక రహిత’ రాష్ట్రంగా కేరళ.
ఢిల్లీ,24, అక్టోబర్ (హి.స.) కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం అనుసరించిన విధానాలు విజయవంతమయ్యాయి. దీంతో ‘‘అత్యంత పేద రహిత రాష్ట్రం’’గా కేరళ అవతరించింది. ఈ మేరకు నవంబర్ 1న కేరళ రాష్ట
‘అత్యంత పేదరిక రహిత’ రాష్ట్రంగా కేరళ.


ఢిల్లీ,24, అక్టోబర్ (హి.స.) కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం అనుసరించిన విధానాలు విజయవంతమయ్యాయి. దీంతో ‘‘అత్యంత పేద రహిత రాష్ట్రం’’గా కేరళ అవతరించింది. ఈ మేరకు నవంబర్ 1న కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారికంగా ప్రకటించనున్నారు. సినీ తారలు మమ్ముట్టి, మోహన్ లాల్, కమల్ హాసన్ సమక్షంలో ఈ ప్రకటన చేయనున్నారు.

అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన మొదటి భారతీయ రాష్ట్రంగా కేరళ అవతరించిందని మంత్రి ఎంబీ రాజేష్, విద్యా మంత్రి శివన్‌కుట్టి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ చారిత్రక ప్రకటనను తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత పినరయి విజయన్ ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత సతీశన్‌ కూడా హాజరవుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande