
నల్గొండ, 25 అక్టోబర్ (హి.స.)
నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రంలోని ఐకేపీకి చెందిన రైతులు ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని నార్కెట్పల్లి అద్దంకి రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ... గత ఇరవై రోజులుగా ధాన్యం తీసుకొచ్చినప్పటికి అధికారులు కొనుగోలు ప్రారంభించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రైతుల రాస్తారోకోతో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్థంభించింది. పోలీస్లు సంబంధిత అధికారులతో మాట్లాడి.. రాస్తారోకో విరమింపజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు