
న్యూఢిల్లీ, ,25, అక్టోబర్ (హి.స.)
క్యాబ్ సర్వీసులు అందించే ఓలా, ఉబర్లకు పోటీగా ‘భారత్ ట్యాక్సీ’ వస్తోంది. క్యాబ్ నిర్వాహకుల నుంచి ఎలాంటి కమీషన్లు వసూలు చేయకుండా, సహకార పద్ధతిలో నిర్వహించే ఈ సర్వీసుతో.. అటు క్యాబ్ నిర్వాహకులకు, ఇటు ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది. ఓలా, ఉబర్ సంస్థలు క్యాబ్ నిర్వాహకులు, డ్రైవర్ల నుంచి అడ్డగోలుగా 25ు వరకు కమీషన్లు వసూలు చేస్తున్నాయని.. ప్రయాణాల రద్దు, రద్దీ సమయాల పేరిట ప్రయాణికుల నుంచి అడ్డగోలు చార్జీలు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రైవేటు క్యాబ్ సర్వీసులకు ప్రత్యామ్నాయాన్ని అందుబాటులోకి తేవడం.. క్యాబ్ నిర్వాహకులు, డ్రైవర్లకు ప్రయాణ చార్జీలు పూర్తిగా అందేలా చేయడం లక్ష్యంగా.. కేంద్ర సహకారశాఖ, జాతీయ ఈ-గవర్నెన్స్ విభాగం (ఎన్ఈజీడీ) ‘భారత్ ట్యాక్సీ’ని రూపొందించింది. రూ.300 కోట్ల మూలధనంతో ‘సహకార్ ట్యాక్సీ కో-ఆపరేటివ్ లిమిటెడ్’ సంస్థను ఏర్పాటు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ