
వికారాబాద్, 26 అక్టోబర్ (హి.స.)
ప్రతి మనిషి ఆరోగ్యాంగా ఉంటేనే జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఆదివారం ఉదయం అనంతగిరిలో తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ మొదటిసారిగా నిర్వహించిన ట్రయిల్ రన్ కార్యక్రమంలో పాలొన్న కలెక్టర్.. మనిషి జీవితంలో ఆరోగ్యమే ప్రధానమని, దేశ శ్రేయస్సు ఆరోగ్యకరమైన జనాభాపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
అనంతగిరి అటవీ ప్రాంతం ఔషధ మొక్కలకు నిలయమని, ఇక్కడి గాలి ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని, ఈ ప్రాంతంలో తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ట్రయల్ రన్ నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు