
హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ నగరంలోని నల్లకుంటలో ఉన్న శంకర్ మఠ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మంత్రి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఉన్నారు. అయితే, 'ధర్మ విజయ యాత్ర'లో భాగంగా శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతి స్వామి నగరంలోని నల్లకుంటలో ఉన్న శంకర్ మఠ్ కు వచ్చారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్రెడ్డి నేరుగా శంకర్ మఠ్ కు వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని దివ్య ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను విధుశేఖర భారతీ స్వామి వారికి సమగ్రంగా వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..