
పిఠాపురం:, 28 అక్టోబర్ (హి.స.) మొంథా తుపాను ప్రభావంతో ఏపీ తీర ప్రాంతాల్లో అలలు ఎగసిపడుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో కెరటాల ఉద్ధృతి మరింత పెరిగింది. ఈ ప్రభావంతో ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసమైంది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఉప్పాడ తీరం కోతకు గురవుతోంది. ఇప్పటికే అక్కడ దెబ్బతిన్న కొన్ని గృహాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ