
గన్నవరం, 28 అక్టోబర్ (హి.స.) ,, విశాఖపట్నం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా, ఇండిగో సర్వీసులన్నీ మంగళవారం రద్దయ్యాయి. ఇండిగోకు సంబంధించి ఉదయం 10.45 వరకు నడిచేవి, దిల్లీ - విజయవాడ మధ్య నడిచే సర్వీసు మాత్రం యథావిధిగా రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు.
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం రాకపోకలు సాగించాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో విమాన సర్వీసులు రద్దయినట్లు విమానాశ్రయ డైరెక్టర్ ఎన్.పురుషోత్తం ఓ ప్రకటనలో తెలిపారు. వీటిలో దిల్లీ, భువనేశ్వర్, విజయవాడ, రాయ్పూర్, హైదరాబాద్, బెంగళూరుకు రాకపోకలు సాగించే సర్వీసులున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ