పత్తి పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు : కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, 28 అక్టోబర్ (హి.స.) జిల్లాలో పత్తి పంట కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగ
నిర్మల్ కలెక్టర్


నిర్మల్, 28 అక్టోబర్ (హి.స.)

జిల్లాలో పత్తి పంట కొనుగోలు

కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీసీఐ సంస్థ సమయానికి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల నుంచి పత్తి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ సౌకర్యం కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు పత్తి అమ్మకానికి సంబంధించిన స్లాట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. యాప్ వినియోగంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande