
ముంబై 28 అక్టోబర్ (హి.స.)దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 72.34 పాయింట్లు (0.085 శాతం) లాభంతో 84,851.19 వద్ద, నిఫ్టీ 10.05 పాయింట్లు (0.039 శాతం) లాభంతో 25,976.10 వద్ద ముందుకు సాగుతున్నాయి.
సాయి సిల్క్స్ కళామందిర్, భారత్ వైర్ రోప్స్, తమిళనాడు న్యూస్ప్రింట్ అండ్ పేపర్స్, దావణగెరె షుగర్ కంపెనీ, ఐఎఫ్బీ ఆగ్రో ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మనక్సియా కోటెడ్ మెటల్స్ & ఇండస్ట్రీస్, కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్, బాటా ఇండియా, ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్, లాటీస్ ఇండస్ట్రీస్ వంటివి నష్టాల జాబితాలో సాగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు