నిజాంసాగర్ ప్రాజెక్టు కు వరద తాకిడి.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల
కామారెడ్డి, 29 అక్టోబర్ (హి.స.) బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ప్రభావంతో నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. బుధవారం ప్రాజెక్టు ద్వారా రెండు వరద గేట్లను ఎత్తి దిగ
నిజాంసాగర్ ప్రాజెక్టు


కామారెడ్డి, 29 అక్టోబర్ (హి.స.) బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ప్రభావంతో నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. బుధవారం ప్రాజెక్టు ద్వారా రెండు వరద గేట్లను ఎత్తి దిగువకు 9 వేల 570 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి పారుదల శాఖ ఏఈ సాకేత్ తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ప్రాజెక్టులోకి 9 వేల 570 ఇన్ ఫ్లో గా వచ్చి చేరుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1405.00 అడుగుల (17.802 టీఎంసీలు) నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు రెండు వరద గేట్లను ఎత్తివేసి 9 వేల 570 క్యూసెక్కుల వరద నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande