తోపుదుర్తికి పరిటాల సునీత స్ట్రాంగ్ వార్నింగ్
అనంతపురం, 5 అక్టోబర్ (హి.స.)అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై మరోసారి అసత్య ప్రచారా
పరిటాల సునీత


అనంతపురం, 5 అక్టోబర్ (హి.స.)అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై మరోసారి అసత్య ప్రచారాలు చేస్తే 'చెప్పు తెగుతుంది' అంటూ ఘాటుగా హెచ్చరించారు. ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాలు విసిరారు.

రాప్తాడు నియోజకవర్గంలో హౌసింగ్ లబ్ధిదారుల నుంచి ఎమ్మెల్యే పరిటాల సునీత రూ.10 వేలు చొప్పున వసూలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. నిరుపేదలను కూడా వదలకుండా పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నారని ఆయన విమర్శించారు.

తోపుదుర్తి ఆరోపణలపై పరిటాల సునీత ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. కారు కూతలు కూస్తే కఠిన చర్యలు తప్పవు. కడుపుకు అన్నం తినేవాడెవడూ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడు, అని మండిపడ్డారు. తమ కుటుంబం పది రూపాయలు జేబులోంచి తీసి పేదలకు సాయం చేస్తుందే తప్ప, ఇతరుల వద్ద చేయి చాపే అలవాటు తమ రక్తంలోనే లేదని ఆమె స్పష్టం చేశారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డే ఇలాంటి పనులు చేసి ఉండొచ్చని, అందుకే ఆయనకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయని పరిటాల సునీత ఎదురుదాడి చేశారు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande