నాగర్ కర్నూల్, 9 అక్టోబర్ (హి.స.)
ఈవీఎం గోదాముల్లో భద్రతాపరమైన
ఎలాంటి లోపాలు ఉండవద్దని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. నాగర్కర్నూల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం కందనూల్ మున్సిపాలిటీ పరిధిలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచిన గోదామును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల భద్రత అత్యంత ముఖ్యమైన అంశమన్నారు. గోదాములో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, యాక్సెస్ కంట్రోల్ వ్యవస్థలను ఆయన సమీక్షించారు. సాంకేతిక సిబ్బందితో మాట్లాడి యంత్రాల నిర్వహణ, రికార్డు నిర్వహణ, రోజువారీ పర్యవేక్షణ చర్యల వివరాలు తెలుసుకున్నారు.
అని ప్రతి నెలా ఈవీఎంలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. భద్రతా పరికరాలు ఎల్లప్పుడూ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా నిర్ధారించుకోవాలన్నారు. ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. గోదాములో అగ్ని ప్రమాద నిరోధక పరికరాలు, విద్యుత్ సదుపాయాలు, రక్షణ గార్డులు విధుల అంశాలను కూడా ఆయన పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు