
అమరావతి, 10 నవంబర్ (హి.స.)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్బంగా సమావేశంలో మంత్రులను సీఎం అభినందించారు. మొంథా తుఫాను సమయంలో క్షేత్ర స్థాయిలో బాగా పనిచేశారని మంత్రులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ క్షేత్ర స్థాయిలో ఉండి... ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పని చేయడం వల్లనే తుఫాను సహాయక చర్యలు వేగంగా అందయాని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ