
అమరావతి, 10 నవంబర్ (హి.స.)
: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. 65కి పైగా ఎజెండా అంశాల అజెండాతో సాగిన ఈ సమావేశంలో 65కి పైగా అంశాలను ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్.. వైజాగ్ లో ఈ నెలలో జరగబోయే సీఐఐ సమ్మిట్కు సంబంధించి చర్చ సాగింది.. క్వాoటం పాలసీకి ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. ఇక, మొంథా తుఫాన్ సందర్భంగా చేపట్టిన చర్యలపై మంత్రులకు అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరోవైపు, పార్టీ కార్యాలయాల లీజ్ కు సంబంధించి చట్ట సవరణకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ