
హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.)
చిలుకూరు హుజూర్ నగర్
రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు కర్నూలుకు చెందిన డ్రైవర్ ఎన్.రఘు (43) తన వాహనంతో హుజూర్ నగర్ వైపు వెళ్తుండగా చిలుకూరు సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల దగ్గర, లారీ ఢీకొంది. దీంతో రఘు అక్కడికక్కడే మృతి చెందాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు