
పెద్దపల్లి, 17 నవంబర్ (హి.స.)
రాష్ట్రం, దేశంలోనే సంచలనం
సృష్టించిన లాయర్ల దంపతుల హత్య కేసు పై మంథని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ను సిబిఐ అధికారులు ఎంక్వయిరీ చేస్తున్నారు. సోమవారం పెద్దపెల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో సిబిఐ అధికారులు బిఆర్ఎస్ పార్టీ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, మంథని మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజను పలు ప్రశ్నలపై ఎంక్వయిరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన లాయర్ గట్టు వామన్ రావు, నాగమణి దంపతుల హత్య సంఘటనపై సిబిఐ ఎంక్వైరీ కి హాజరైనారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..