
పెద్దపల్లి, 17 నవంబర్ (హి.స.)
గురుకులాల పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం మంథని పట్టణం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలకు సంబంధించిన పలు రికార్డులను ఆయన పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... ప్రభుత్వం గురుకులాల పైన ప్రత్యేక శ్రద్ధ వహించిందని, విద్యార్థులు గురుకులాలను జీవితంలో ఉన్నత స్థాయికి ఉపయోగించుకొని చేరుకోవాలని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు