
పాడేరు18 నవంబర్ (హి.స.): నాణ్యత, రుచిలో అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన మన్యం కాఫీ ధరలు సీజన్ ఆరంభంలోనే అదిరాయి. రైతుల్లో ఆనందం నెలకొంది. దేశీయ మార్కెట్కు కేంద్ర బిందువైన బెంగళూరులో సోమవారం కిలో పార్చిమెంట్ కాఫీ ధర రూ. 545, చెర్రీ రూ. 310 వరకూ ఉందని కేంద్ర కాఫీబోర్డు అధికారి రమేష్ పేర్కొన్నారు. అల్లూరి జిల్లా ఏజెన్సీ పదకొండు మండలాల్లో 2.5 లక్షల మంది రైతులు దీనిని పండిస్తున్నారు. ఈఏడాది 18 వేల టన్నుల వరకూ దిగుబడి రావొచ్చని కాఫీ విభాగం అధికారులు, మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మన్యంవ్యాప్తంగా కాఫీ పండ్ల సేకరణ ప్రారంభమైంది. పండ్లను కొంతమంది రైతులు కిలో రూ. 70 నుంచి రూ. 80 మధ్యలో విక్రయిస్తున్నారు. భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉండటంతో కొంతమంది కాఫీని శుద్ధి చేసి నిల్వ ఉంచుతున్నారు. ఏటా జీసీసీ కాఫీ సేకరణ ఇప్పటికే ప్రారంభమయ్యేది. ఈఏడాది సీజన్ సమీపించినా రైతుల వద్ద కొనుగోలు చేసే ధర నిర్ణయించే అపెక్స్ కమిటీ
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ