
నందిగామ, 18 నవంబర్ (హి.స.)
: ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ