చెన్నై నగర వాసులకు బుల్లెట్ ట్రైన్ కల సాకారమైంది
చెన్నై, 26 నవంబర్ (హి.స.) నగరవాసులకు బుల్లెట్ రైలు కల సాకారమవనుంది. ఇంటర్‌ సిటీ ప్రయాణాన్ని పునర్నిర్మించే ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ రైలు మార్గానికి దక్షిణ మధ్య రైల్వే తమిళనాడు ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలో చేర్చేంద
చెన్నై నగర వాసులకు బుల్లెట్ ట్రైన్ కల సాకారమైంది


చెన్నై, 26 నవంబర్ (హి.స.) నగరవాసులకు బుల్లెట్ రైలు కల సాకారమవనుంది. ఇంటర్‌ సిటీ ప్రయాణాన్ని పునర్నిర్మించే ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ రైలు మార్గానికి దక్షిణ మధ్య రైల్వే తమిళనాడు ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలో చేర్చేందుకు తుది అలైన్‌మెంట్ సమర్పించింది.

హైస్పీడ్‌ మార్గం కారిడార్‌కు సమగ్ర ప్రాజెక్టు నివేదికపై రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లభించిన తర్వాత నెలలోపు ఖరారు చేస్తామని చెన్నై యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ(సీయూఎంటీఏ) సభ్య కార్యదర్శి ఐ.జయకుమార్‌ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థన మేరకు గతంలో గూడూరు మీదుగా ప్రణాళిక రూపొందించిన స్థానంలో తిరుపతిలో స్టేషన్‌ను చేర్చడానికి మార్పులు చేశా

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande