లొంగిపోయిన మావోయిస్టు అనంత్ టీమ్.. లేఖ విడుదల చేసిన 24 గంటల్లోనే సరెండర్
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.) మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ (ఎంఎంసీ) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 10 మంది మావోయిస్టులతో కలిసి ఆయన మహారాష్ట్ర
మావోయిస్టు అనంత్


హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ (ఎంఎంసీ) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 10 మంది మావోయిస్టులతో కలిసి ఆయన మహారాష్ట్ర లోని గోండియా జిల్లా దారేక్ష పోలీస్టేషన్లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఐదు రాష్ట్రాల్లో ఆయనపై రూ కోటి రివార్డు ఉంది..

జనవరి 1వ తేదీన లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని తాజాగా అనంత్ ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖ విడుదల చేసిన 24 గంటలు తిరగకముందే ఆయన పోలీసులకు లొంగిపోవడం గమనార్హం.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande