
విజయవాడ, 3 నవంబర్ (హి.స.)
:మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడుపై కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధం అయ్యారు. నిన్న(ఆదివారం) ప్రభుత్వ ఆసుపత్రిలో జోగి రమేష్ను హాజరు పరిచే సమయంలో ఆయన కుమారుడు వైసీపీ అనుచరులతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో.. వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. అనంతరం ఆసుపత్రి అద్దాలు, తలుపులను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ