
ములుగు, 15 డిసెంబర్ (హి.స.)
రానున్న మహా మేడారం జాతరను పురస్కరించుకుని సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలం మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్ణీత సమయంలో భక్తులకు అందుబాటులో ఉంచాలని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు.
నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు