
నంద్యాల, 19 డిసెంబర్ (హి.స.)
జిల్లాలో చాక్లెట్లు కలకలం సృష్టించాయి. చాక్లెట్లు తిన్న 11 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన చాక్లెట్లు తినటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నందికోట్కూరుకు చెందిన ఓ బాలిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. బాలిక స్కూలుకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బాలికకు చాక్లెట్ల ప్యాకెట్ ఇచ్చాడు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు పంపిణీ చేయాలని చెప్పాడు. ఆ బాలిక స్కూలు వెళ్లిన తర్వాత పీటీ టీచర్తో పాటు పలువురు విద్యార్థినులకు చాక్లెట్లను పంచింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ