గాయపడిన విద్యార్థులను పరామర్శించిన జిల్లా కలెక్టర్
మహబూబ్నగర్, 25 డిసెంబర్ (హి.స.) మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజేందిర బోయి పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన 6 మంద
మహబూబ్నగర్ కలెక్టర్


మహబూబ్నగర్, 25 డిసెంబర్ (హి.స.)

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్

మండలం పెద్దాయపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజేందిర బోయి పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన 6 మంది విద్యార్థులను షాద్ నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande