
సంగారెడ్డి, 25 డిసెంబర్ (హి.స.)
క్రీడలు, క్రీడాకారుల సహకారం అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ అందిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరగనున్న 72వ సీనియర్ కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనబోయే సంగారెడ్డి జిల్లా పురుషులు, మహిళల కబడ్డీ జట్లకు జెర్సీలను గురువారం పట్టణంలోని మైత్రి మైదానంలో ఎమ్మెల్యే క్రీడాకారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామీణ స్థాయి నుంచి క్రీడలపై ఆసక్తిని పెంపొందించేలా వివిధ విభాగాల్లో ప్రతి సంవత్సరం క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే జనవరిలో జాతీయ స్థాయి క్రీడా పోటీలకు పటాన్ చెరు ఆతిథ్యం ఇవ్వబోతుందని వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు