
హైదరాబాద్/ అమరావతి, , 26 డిసెంబర్ (హి.స.)
వాతావరణంలో మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. తెల్లవారుజాము నుంచి మంచు దుప్పటి కప్పేసినట్లుగా ఉంటుంది. రాత్రి వేళల్లో గత రెండు వారాలుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళలల్లో బయటకు వెళ్లాలంటే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంటి పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరు దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ