
హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.)
నూతనంగా ఏర్పడిన రాజేంద్రనగర్
జోనల్ కమిషనర్ కార్యాలయంను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్ శుక్రవారం ప్రారంభించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సమక్షంలో రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి ఐ ఎ ఎస్ బాధ్యతలు స్వీకరించారు. జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతికి పుష్పగుచ్చం అందించి ఆర్ వి కర్ణన్. అభినందనలు తెలిపారు. నూతనంగా ఏర్పడిన రాజేంద్రనగర్ జోనల్ కార్యాలయంలోకి అత్తాపూర్, రాజేంద్రనగర్, బహదూర్ పురా, ఫలక్ నుమా, చంద్రాయన గుట్ట, జంగమ్మెట్ సర్కిల్ కార్యాలయాలను విలీనం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు