
అమరావతి, 27 డిసెంబర్ (హి.స.)
అమరావతి: గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనను ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. విజయవాడ, తిరుపతికి గ్రేటర్ హోదాకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని పురపాలకశాఖ మంత్రి నారాయణ చెప్పారు. జనగణన పూర్తయ్యే వరకు డీలిమిటేషన్ చేయకూడదని కేంద్రం ఆదేశాలు ఉన్నాయని, అందుకే ఈ ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. ‘‘జనగణనకు ముందు విలీనానికి ఇబ్బందులు ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ