రాష్ట్రంపై చలి పంజా.. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణ, 27 డిసెంబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ చలితీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రతకు ప్రజలు వణుకుతున్నారు. నేడు, రేపు, రాష్ట్రంలో చలి అధికంగా ఉంటుందని పేర్కొంటూ.. 13 జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింద
చలి పంజా


తెలంగాణ, 27 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ చలితీవ్రత

పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రతకు ప్రజలు వణుకుతున్నారు. నేడు, రేపు, రాష్ట్రంలో చలి అధికంగా ఉంటుందని పేర్కొంటూ.. 13 జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. నేడు ఆదిలాబాద్, కొమురం భీం, సంగారెడ్డి, మెదక్, మచిర్యాల, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న ఆదిలాబాద్ లో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

ఇక హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల కనిష్టానికి పడిపోనున్నట్లు తెలిపింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని, రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande