
ఢిల్లీ ,04 డిసెంబర్ (హి.స.) పార్లమెంట్ శీతాకాల సమావేశాల నాలుగవ రోజు (గురువారం) సభ సమావేశమైన వెంటనే, ప్రతిపక్షాలు ప్రధానంగా రెండు కీలక సమస్యలను లేవనెత్తాయి. అవి ఢిల్లీ-ఎన్సిఆర్, ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్య సంక్షోభం, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి పడిపోవడం. ప్రతిపక్షాల ఎజెండాలో వాయు కాలుష్యంపై చర్చ ప్రధానాంశంగా నిలవగా, పలువురు ప్రతిపక్ష ఎంపీలు గ్యాస్ మాస్క్లు ధరించి నిరసన తెలిపారు. ఈ సమస్యను జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలని వారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఉత్తర భారతదేశంలోని నెల రోజుల నుంచి తీవ్రమవుతున్న వాయు కాలుష్య సంక్షోభంపై చర్చ నిర్వహించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీలు లోక్సభలో వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. మాణికం ఠాగూర్, మనీష్ తివారీ, విజయకుమార్ అలియాస్ విజయ్ వసంత్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్న ఈ సంక్షోభాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ తీర్మానం నోటీసులో ప్రభుత్వం సమన్వయంతో కూడిన జాతీయ వ్యూహాన్ని రూపొందించడంలో విఫలమైందని, పక్షవాతానికి గురై, చర్యలకు బదులుగా సలహాలు మాత్రమే ఇస్తోందని తీవ్రంగా విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ