స్టూడెంట్ ఐడీ కార్డు ఉందా..? రైలు టికెట్లపై 70 శాతం అదిరే డిస్కౌంట్.. పొందండిలా..!
ముంబై, 5 డిసెంబర్ (హి.స.) ప్రయాణికులు సౌకర్యవంతంగా, సురక్షితంగా ప్రయాణించేందుకు రైల్వేశాఖ అనేక సదుపాయాలు కల్పిస్తోంది. కానీ రైల్వేశాఖ అందిస్తున్న సదుపాయాల గురించి చాలామందికి అవగాహన ఉండదు. దీంతో అర్హత ఉండి కూడా వాటిని ఉపయోగించుకోలేకపోతుంటారు. విద్యా
Train


ముంబై, 5 డిసెంబర్ (హి.స.) ప్రయాణికులు సౌకర్యవంతంగా, సురక్షితంగా ప్రయాణించేందుకు రైల్వేశాఖ అనేక సదుపాయాలు కల్పిస్తోంది. కానీ రైల్వేశాఖ అందిస్తున్న సదుపాయాల గురించి చాలామందికి అవగాహన ఉండదు. దీంతో అర్హత ఉండి కూడా వాటిని ఉపయోగించుకోలేకపోతుంటారు. విద్యార్థులకు బస్సుల్లో రాయితీపై ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉండటం అందరికీ తెలిసిందే. స్టూడెంట్ బస్ పాస్ ద్వారా తక్కువ ధరకే ప్రయాణం చేయొచ్చు. ఇక రైళ్లల్లో కూడా విద్యార్థులకు రాయితీతో కూడిన ప్రయాణం ఉందని మీకు తెలుసా..? రైళ్లల్లో వృద్దులు, అంగవైకల్యం ఉన్నవారికి టికెట్లపై రాయితీ ఉన్న విషయం తెలిసిందే. కానీ విద్యార్థులు కూడా టికెట్ల ధరలపై డిస్కౌంట్ పొందే సదుపాయం అమల్లోకి ఉంది.

75 శాతం వరకు రాయితీ

రైల్వేశాఖ రూల్స్ ప్రకారం.. స్కూల్ లేదా కాలేజ్ విద్యార్థులు ట్రైన్ ద్వారా ప్రయాణం చేస్తే 50 నుంచి 75 శాతం వరకు డిస్కౌంట్ వస్తుంది. కానీ ఐఆర్‌సీటీసీ యాప్ లేదా ఇతర ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుంటే డిస్కౌంట్ రాదు. 12 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్‌కి వెళ్లి తీసుకునే టికెట్లపై డిస్కౌంట్ లభిస్తుంది. జనరల్ కేటగిరీ విద్యార్ధులు 50 శాతం వరకు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులు 75 శాతం వరకు తమ టికెట్‌పై డిస్కౌంట్ పొందుతారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande