అనంతపురం జిల్లా | పీఏబీఆర్ కుడి కాలువలో గండి
అనంతపురం, 7 డిసెంబర్ (హి.స.) అనంతపురం (Anantapuram) జిల్లాలో సాగునీటి అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న పీఏబీఆర్ (Penna Ahobilam Balancing Reservoir) కుడికాలువకు పెను విఘాతం కలిగింది. కూడేరు మండలం జల్లిపల్లి సమీపంలో కాలువకు భారీ గండి పడటంతో, అందులోని నీ
anantapur-district-gandi-in-the-right-canal-of-pabr-501578


అనంతపురం, 7 డిసెంబర్ (హి.స.)

అనంతపురం (Anantapuram) జిల్లాలో సాగునీటి అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న పీఏబీఆర్ (Penna Ahobilam Balancing Reservoir) కుడికాలువకు పెను విఘాతం కలిగింది. కూడేరు మండలం జల్లిపల్లి సమీపంలో కాలువకు భారీ గండి పడటంతో, అందులోని నీరు ఉధృతంగా పొలాల్లోకి ప్రవహిస్తోంది. ఈ ఘటనతో సమీపంలోని పదుల ఎకరాల్లో వేసిన పంటలు పూర్తిగా నీట మునిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే ప్రకృతి విపత్తులు, నీటి కొరతతో అల్లాడుతున్న రైతులు, ఈ ఆకస్మిక గండి పడడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

కాలువకు గండి పడిన విషయం తెలిసిన వెంటనే నీటి సరఫరాను నియంత్రించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. అయినా కూడా కుడి కాలువ గేట్లు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడినట్లు తెలిపారు. దీంతో కాలువలో ప్రవాహం తగ్గక, నీరు పొలాల్లోకి నిరంతరం చేరి నష్టాన్ని మరింత పెంచిందని రైతులు వాపోతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande