అమరావతి, 24 మే (హి.స.)
యాదాద్రిభువనగిరి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండ కింద ఆధ్యాత్మిక వాడలోని రహదారులు, పార్కింగ్ ప్రాంతం, వ్రత మండపం, పుష్కరిణి ప్రాంగణం, మండపాలు కిక్కిరిశాయి. రద్దీ అధికంగా ఉండటంతో కొండపైకి వాహనాలను వెసులుబాటును బట్టి అనుమతిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ధర్మ దర్శనానికి 3గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2గంటల సమయం పడుతోంది. వివిధ ఆర్జిత పూజల్లో పాల్గొని, స్వామివారిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ