అమరావతి, 24 మే (హి.స.)
దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో రూ.13 కోట్ల వ్యయంతో శాశ్వత క్యూలైను కాంప్లెక్సు నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. గత ఏడాది శాశ్వత క్యూలైన్ల నిర్మాణం నిమిత్తం ఈ ప్రాంతంలో ఉన్న దుకాణాలను గోశాల వైపునకు తరలించారు. ఈ క్రమంలో కనకదుర్గానగర్ నుంచి క్యూ లైను మల్లికార్జున మహా మండపం ఎన్నో అంతస్తుకు కలపాలి అన్న విషయంపై ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనాచౌదరి, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఇంజినీరింగ్ నిపుణులతో పలు దఫాలుగా చర్చించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ