తాజాగా.కడప జిల్లాలో.ఘోర రోడ్డు.ప్రమాదం జరిగింది
కడప, 24 మే (హి.స.):ఆంధ్రప్రదేశ్‌లోవరుస ప్రమాదాలతో (t) రోడ్లు నెత్తురోడుతున్నాయి. తాజాగా కడప జిల్లాలో ) ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద శబ్ధంతో ప్రమాదం జరగడంతో స్థానికులు గమనించ
తాజాగా.కడప జిల్లాలో.ఘోర రోడ్డు.ప్రమాదం జరిగింది


కడప, 24 మే (హి.స.):ఆంధ్రప్రదేశ్‌లోవరుస ప్రమాదాలతో (t) రోడ్లు నెత్తురోడుతున్నాయి. తాజాగా కడప జిల్లాలో ) ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

పెద్ద శబ్ధంతో ప్రమాదం జరగడంతో స్థానికులు గమనించి వాహనాల వద్దకు పరుగులు తీశారు. అలాగే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ ఢీకొనడంతో కారులో ఉన్నవారు అందులోకి చిక్కుకుపోయారు. దీంతో పోలీసులు, స్థానికులు కలిసి వారిని కారులో నుంచి బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు బద్వేల్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు.బెంగళూరు నుంచి కారులో బద్వేల్‌కు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande