యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి మూడు గంటల సమయం..
తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 24 మే (హి.స.) యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి శనివారం భక్తజనం పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. లక్ష్మీ నరసింహ స్వామి ధర్
యాదాద్రి


తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 24 మే (హి.స.) యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి శనివారం భక్తజనం పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. లక్ష్మీ నరసింహ స్వామి ధర్మ దర్శనానికి సుమారు 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంటకు పైగా సమయం పడుతోంది. దీంతో క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ప్రధానాలయం, కల్యాణోత్సవం, వ్రత మండపాలు, ఆలయ తిరువీధుల, శివాలయం, ప్రసాద విక్రయశాల, కొండకింద వ్రత మండపం, లక్ష్మీ పుష్కరిణి, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట తదితర ప్రాంగణాలు భక్తులతో రద్దీగా మారాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande